కరీంనగర్, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): 133వ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని భాగ్యనగర్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించి, భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా , విద్యా మరియు సామాజికంగా అభివృద్ధి చెందాలని వారికి రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన గొప్ప దార్శనికుడు అని తెలిపారు.ప్రజలు విద్యా ద్వారా ప్రయోజకులై దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్న వ్యక్తి అని అన్నారు. తన ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
