గుర్తుకొస్తున్నాయి….. చిన్ననాటి జ్ఞాపకాలు. * కాల గమనంలో గతించిన మిత్రులకు శ్రద్ధాంజలి..

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): గన్నేరువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గన్నేరువరంలో 1998-99 సంవత్సరం లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థు లు 25 సంవత్సరాల తర్వాత ఆదివారం మండల కేంద్రంలో అందరూ కలిసి పూర్వ విద్యార్థుల, ఉపాధ్యాయుల సమ్మేళనం ను నిర్వహించారు. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారు దీవెనలు పొందారు. బతుకు పోరాటంలో కొంతమంది ఉద్యోగస్తులయితే మరి కొంతమంది వివిధ రంగాలలో స్థిరపడ గా పేద ధనిక భేదం లేకుండా 25 సంవత్సరాలు వెనుకకు వెళ్లి చిన్న వారిగా మారి ఆడి పాడారు. పాఠశాలలో వారు చదువుకున్న తరగతి గదులను, క్రీడా ప్రాంగణము ను, చిలిపి చేష్టలను, గురువుల దండనలు, వారి ఆప్యాయతను గుర్తుచేసుకొని వారి వద్ద దీవెనలు పొందారు. గడిచిన 25 ఏళ్ల లో కోల్పోయిన మిత్రులను, ఉపాధ్యాయులను స్మరించుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వివిధ రంగాలలో ఈరోజు నిలదొక్కుకోవడానికి అప్పుడు ఉపాధ్యాయులు అందించిన చదువు, క్రమశిక్షణ నే అని కొనియాడారు. అందరి కష్టసుఖాలను తెలుసుకొని వీడుకోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు పూర్వ ఉపాధ్యాయులు రామచంద్రం, స్వామి రెడ్డి, చంద్రయ్య,శ్రీనివాస్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, రహీం, అనిత, రామిరెడ్డి, పూర్వ విద్యార్థులు బూర తిరుపతి, పబ్బతి రమేష్, గెల్లు ఐలయ్య, జీల జీల అంజయ్య అధిక సంఖ్యలో పూర్వ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది….. బూర తిరుపతి పూర్వ విద్యార్థి 25 ఏళ్ల క్రితం పాఠశాల నుండి విడిపోయిన మేమంతా ఈరోజు ఒకచోట కలవడం చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఆనందంగా వేడుక చేసుకునే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. విద్యార్థులు స్థిరపడడమే ఉపాధ్యాయులకు ఆనందం…..(రామచంద్రం తెలుగు పండిట్ పూర్వ ఉపాధ్యాయుడు) తాము చదువు చెప్పిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, వివిధ రంగాలలో స్థిరపడ్డప్పుడే మాకు ఆనందంగా ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం మా వద్ద చదువుకున్న వాళ్ళు ఇంత ఉన్నత స్థితికి రావడం, వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు