అంబేద్కర్ కు ఘన నివాళి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు హాజరు

కరీంనగర్, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న ఆ మహానీయుడి విగ్రహానికి ఆదివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. ఆ మహానీయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీవో కే మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీఓ శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ కొత్తపల్లి తహసీల్దార్లు ఎం రమేశ్, నవీన్ కుమార్, రాజేశ్, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగెం లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు