కరీంనగర్, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఇమ్రాన్ ప్రతాప్ గరీ కర్ణాటక రాష్ట్రంలో మైనారిటీ ఓటర్లను ఆకర్షించే కార్యాచరణలో భాగంగా లోక్ సభ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించడం జరిగింది. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె సిరాజ్ హుస్సేన్ ని గుల్బర్గా నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమించడం జరిగింది. గుల్బర్గా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం లక్ష్యంగా మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టి మైనారిటీ ఓట్ పెంచడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, నాకు అప్పచెప్పిన ఈ బాధ్యత పట్ల పూర్తి నిజాయితీతో పని చేస్తానని తనకు అవకాశం ఇచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కరిగేకి, జాతీయ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ ఘ గారికి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, జాతీయ కాంగ్రెస్ సమన్వయకర్త జీనల్ ఎన్. జీకి సిరాజ్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
