కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ( నిధమ్) గచ్చి బౌలి, హైదరాబాద్ లో టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది .తెలంగాణా ప్రభుత్వ ఆమోదిత కళాశాల నిదిమ్ లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ , ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూ లతో పాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయి విద్యా విధానంతో నిధిమ్ లో ఉన్నత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నది. అడ్మిషన్, ఇతర వివరాలకు జిల్లా పర్యటక శాఖ కార్యాలయం, కరీంనగర్ లో గాని, జిల్లా పర్యాటక శాఖ అధికారి 9440816070 లేదా లో సంప్రదించగలరు.
