ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్… ఫిర్ ఏక్ బార్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్… * బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): దేశంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అని ఉండాలనే నిశ్చయంతో ప్రజలంతా ఉన్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. విజయ సంకల్ప అభియాన్ పేరుతో బిజెపి ఇంటింటికి వెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సోమవారం హుజురాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ బూత్ లలో స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంకల్ప పత్రం అందించి, స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయ సంకల్ప అబియాన్ పేరుతో బిజెపి చేపట్టిన ఇట్టి కార్యక్రమంలో బూతు స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర జాతీయస్థాయి నాయకుల వరకు పాల్గొంటున్నారని, బిజెపి శ్రేణులందరూ ప్రతి ఇంటిని చేరుకునే విధంగా నేడు రేపు జిల్లా వ్యాప్తంగా ఇట్టి కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ బిజెపి మోదీ ప్రభుత్వం పై విశ్వాసం, నమ్మకంతో ఉన్నారని, అందుకే వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అలాగే కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బిజెపి ఆలోచన చేస్తుందని ఆ దిశగానే మ్యానిఫెస్టో రూపొందించిందన్నారు. ముఖ్యంగా 100 రోజుల్లో ఆర్ గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రగల్బాలు పలికి నేడు తూతు మంత్రంగా గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదని, నమ్మి ఓటేస్తే మోసం చేశారనే భావన జనంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి దమ్ముంటే రైతులకు 500 బోనస్ , రెండు లక్షల రుణమాఫీ చేసి ఓట్లను అడగాలన్నారు. మహిళలకు రూ .2500, పింఛన్లు రూ.4000, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం అందించే ధైర్యం లేదని , ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడానికి అరు గ్యారంటీ పథకాలను తీసుకువచ్చిందన్నారు. పథకాలను అమలు చేయకున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలే నష్టపోయే ప్రమాదం ఉందని, గ్యారంటీలను ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదన్నారు. 100 రోజుల్లో అరు గ్యారంటీలను అమలు చేయ ని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో. లేక గ్యారెంటీగా అమలయ్యే మోదీ గ్యారెంటీ కావాలో ప్రజలంతా ఆలోచించాలన్నారు. అలాగే బి ఆర్ ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీకి జరగబోయే ఎన్నికల్లో ఓటేస్తే ప్రయోజనం లేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జి నిర్మలారెడ్డి, భూత అధ్యక్షులు కోఆర్డినేటర్లు బిఎల్ఎ ఏజెంట్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు