కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): దేశం కోసం, ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం బిజెపి నిరంతరం ఆలోచన చేస్తుందని, అందుకే ప్రజల మనసులో చిరస్థాయిగా నేడు భారతీయ జనతా పార్టీ నిలిచిపోయిందని, జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని, దేశానికి మోడీ, కరీంనగర్ కు ఎంపీగా బండి యే ఉండాలని నిశ్చయించుకున్నారని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. విజయ్ సంకల్ప అభయాన్ పేరుతో బిజెపి ఇంటింటికి వెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ లోని పలు పోలింగ్ బూత్ ఏరియాలలో బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బిజెపి శ్రేణులలో కలిసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంకల్ప పత్రం, స్టిక్కర్స్ అంటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ పదేళ్ల బిజెపి పరిపాలనపై ప్రజలంతా నమ్మకం విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని, ఇప్పుడు న్యాయం చేస్తామని మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కెసిఆర్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఆరు గ్యారెంటీ లే ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా 15000, పంట బోనస్ 500 ,మహిళలకు 2500, పింఛన్లు 4000 , ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల సహాయం, లాంటివి అనేకం ఉన్నాయని, వంద రోజుల్లో అమలు ఇచ్చిన హామీలు చేస్తామని ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయకున్నా జరగబోయే ఎన్నికల్లో ఓటు వేస్తే ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అని, ఆ పార్టీ నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలంతా ప్రజలంతా నిలదీయాలన్నారు. ఇక బిఆర్ఎస్ ఎక్స్పైరీ పార్టీ అని, గల్లీలో, ఢిల్లీలో ఉండని ఆ పార్టీకి ఓటు వేస్తే వృధా , బూడిదల పోసిన పన్నీరే అనే భావన ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజలంతా బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
