ధర్మ రక్షణ పోరాటాన్ని కొనసాగించండి * శృంగేరి పీఠాధిపతిని దర్శించుకున్న బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. శృంగేరి పూర్వపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామిజీ 74వ వర్ధంతి సందర్భంగా శృంగేరి విచ్చేసిన బండి సంజయ్ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారు ధర్మ రక్షణ కోసం సంజయ్ చేస్తున్న పోరాటాలను అభినందించారు. ‘‘ధర్మాన్ని వీడొద్దు.. ధర్మరక్షణను కొనసాగించండి. ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ కోసం సమాజాన్ని సంఘటితం చేయడంలో ముందుండి పోరాడండి’’అంటూ ఆశ్వీర్వదించారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు