కాంగ్రెస్ పార్టీ పై బిజెపి శ్రేణుల దుష్ప్రచారంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు 

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీపై దుష్టచారం చేస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయమై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి  నేతృత్వంలోని ఒక బృందం కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఇటీవల ప్రజా తీర్పుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఉదేశపూర్వకంగా కొంతమంది బిజెపి నేతలు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలలో, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కరపత్రాలను ముద్రించి బిజెపి తరపున ఓటు అభ్యర్థి చేస్తున్నట్లుగా, ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా కొంతమంది మార్వాడీ వ్యాపారులు తమ వద్దకు వస్తున్న వినియోగదారులకు ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం అందినది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలుపరుచగా, ఎన్ని కల కోడ్ దృష్టిలో ఉంచుకొని మిగతా 2 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చట్టానికి లోబడి ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదని, బిజెపి పార్టీ శ్రేణులు ఈ విధంగా ప్రచారం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, కావున ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈ విధంగా బిజెపి శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం పై, వారికి సహకరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి రాసిన ఫిర్యాదు లేఖను కలెక్టరేట్ లోని ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు