దేశంలో మతతత్వ బిజెపిని ఓడించేందుకు కమ్యూనిస్టులు సిద్ధం కావాలి : సిపిఐ, సిపిఎం 

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): దేశంలో మతతత్వ బిజెపిని ఓడించేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శిలు మర్రి వెంకట్ స్వామి, మిల్కూరి వాసుదేవ రెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు ల కార్యదర్శులు పత్రిక సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు లేనిపోని హామీలు ఇస్తూ మూడోసారి అధికారం చేపట్టాలని బిజెపి యత్నిస్తుందని దీన్ని అడ్డుకోవాలని కమ్యూనిస్టు కార్యకర్తలకు వారు కోరారు. గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని, మతోన్మాదాన్ని మత రాజకీయ పరిపాలన కొనసాగిస్తుందని తీవ్రంగా విమర్శించారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి మతం తోటి ఓట్లు వేయించుకోవాలని కుట్రకు బిజెపి పూనుకుందని వారు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీటి దేశవ్యాప్తంగా ప్రైవేట్ పరం చేసిన చరిత్ర బిజెపి దేనిని ఎద్దేవా చేశారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతాంగాన్ని ప్రాణాలు తీసుకున్న పార్టీ బిజెపి అని వందల రోజుల పాటు ఢిల్లీ నగరంలో నిరసనలు తెలిపిన రైతులపై తూటాలు పేల్చి వారికి మళ్లీ క్షమాపణ చెప్పిన చరిత్ర బిజెపి ప్రధాని నరేంద్ర మోడీదని వారు ఆరోపించారు. దేశంలో రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ఎంతో ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. భారతదేశ సార్వభౌమత్యాన్ని లౌకికత్వాన్ని రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి చూస్తుందని ఒంటరిగా 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అటువంటి ఆలోచనలు బిజెపి ఉందన్నారు. కుల వ్యవస్థ మత వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు అంబేద్కర్ తీసుకువచ్చినటువంటి చట్టాలను తీసివేయాలని కుట్ర బిజెపి చేస్తుందని బిజెపి ఆగడాలను అరికట్టాలంటే బిజెపిని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. లౌకిక అభ్యుదయ వాదులు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు స్వాతంత్రం తెచ్చుకున్నామో బిజెపి ఆ లక్ష్యాన్ని తుంగలో తొక్కాలని చూస్తుందని అన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసింది ఏమిటని వారు ప్రశ్నించారు. కరీంనగర్లో ఒక చిన్న పరిశ్రమ కూడా తీసుకురాని అసమర్ధుడు సంజయ్ అని అన్నారు. విద్యాపరంగా నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూలు కూడా తెలియని నిస్సహస్థితిలో సంజయ్ ఉండడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. ఇలాంటి వ్యక్తులు గెలవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని వారు ప్రశ్నించారు. ఈనెల 20వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మతతత్వ బిజెపిని ఓడించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు జిల్లాస్థాయి సదస్సును కరీంనగర్లో ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ సమావేశంలోసిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యంసిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, పిట్టల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు