బీజేపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరిన చల్లా నారాయణ రెడ్డి * బీజేపీ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రులు.

కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి  మరియు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు డా.ఎల్. మురుగన్ ఆధ్వర్యంలో కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో తిరుగుతున్న అభివృద్ధిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధినీ దృష్టిలో పెట్టుకొని, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక భారతీయునిగా నా వంతు భాగస్వామ్యం అయ్యి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురావేయాలనే దృడమైన సంకల్పంతో సోమవారం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నా మంథని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మారుమూల మంథని ప్రాంతాన్ని అభివృద్ధి దిశలో నడిపించుకుంటాం. బీజేపీ పార్టీలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మాజీ మంత్రి వర్యులు  పెద్ద రెడ్డి మరియు భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నంగవత్ రాజేష్ నాయక్ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు