కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): తెలంగాణ సాహితి కరీంనగర్ జిల్లా శాఖ నవ తెలంగాణ బుక్ హౌస్ కరీంనగర్లో మహాకవి శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని వారికి పుష్పమాలల తో ఘనంగా నివాళులర్పించింది నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని నినదించిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి ఎన్నో రచనలు చేసి చేసిన మహోన్నతుడు శ్రీశ్రీ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం శాలల మగ్గం శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పిన గొప్ప కవి శ్రీశ్రీ పని తెలంగాణ సాహితి కరీంనగర్ జిల్లా శాఖ అతనికి నివాళులర్పించింది ఈ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు గౌరవ అధ్యక్షులు ఆడెపు రాం నారాయణ ప్రధాన కార్యదర్శి మానువాడ శంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం సతీష్ , అడ్వకేట్ బిరుదుల ప్రవీణ్ ,అడ్డిక రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
