పెద్దపెల్లి/ఓదెల, మే 17 (జాగో న్యూస్): ఓదెల మండలం, కొలనూరు గ్రామంలో శుక్రవారం ఐకేపీ, PACS సెంటర్ని సందర్శించి, నిన్న కురిసిన వర్షానికి తడిసిన వడ్లను ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. అలాగే లారీల కొరత లేకుండా చూడాలని మరియు వడ్లు మ్యాచర్ చూసి ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని, వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వడ్లను కొనుగోలు చేయాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
