అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను సత్వరమే పూర్తి చేయాలి.. * స్కూల్ యూనిఫార్మ్స్, బుక్స్ పాఠశాలల ప్రారంభానికి ముందే అందించాలి.. * ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కారంపై దృష్టి సారించాలి.. * ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి.. * రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి.. * రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

కరీంనగర్, మే 17 (జాగో న్యూస్): అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధాన్యం కొనుగోల్లు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 20 రోజుల్లోగా పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్లు ఫస్ట్ ప్రియారిటిగా తీసుకొని వర్క్స్ పూర్తి చేయించాలని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యుత్, తాగునీరు సరఫరా, కలరింగ్, టాయిలెట్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు కంప్లీట్ చేయాలని సూచించారు. పాఠశాలలన్నీ న్యూ లుక్ తో కనపడేలా వర్క్స్ పూర్తి చేయించాలని స్పష్టం చేశారు. పనులన్నీ నాణ్యతతో ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ త్వరగా అందించా లని పేర్కొన్నారు. ఈ మేరకు యూనిఫామ్ మెజర్మెంట్లు, స్టిచ్చింగ్ తొందరగా పూర్తి చేయించి విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే టెక్స్ట్ బుక్స్ పాఠశాలల ప్రారంభానికి ముందే 100% అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అరేంజ్మెంట్స్ చేసుకోవాలని సూచించారు. స్కూల్ యూనిఫార్మ్స్, టెక్స్ట్ బుక్స్ అందించే విషయంలో జాప్యం జరగవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగు తుందని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ధరణికి సంబంధించిన దరఖాస్తులను సైతం పరిష్కరించా లని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోల్లను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు. తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే తూకం వేసి బ్యాగింగ్ చేయాలని సూచించారు. వెంట వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్లు కిరికిరి పెట్టకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని చెప్పారు. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని సూచించారు. ఈ అంశంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సీఎంఆర్ లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డిఓ కే మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లై జిఎం రజనీకాంత్, ఇన్చార్జి డి సి ఎస్ ఓ సురేష్ రెడ్డి, డి ఆర్దేఓ శ్రీధర్, డీఈవో జనార్దన్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు