ప్రపంచ అధిక రక్తపోటు పై వెబ్నర్

కరీంనగర్, మే 17 (జాగో న్యూస్): ప్రపంచ అధిక రక్తపోటు రోజు నిర్వహిస్తున్న సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వెబ్నర్ నిర్వహించారు. ఈ వెబ్నార్ జిల్లాలోని డాక్టర్ సుజాత, జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. జిల్లాలో అధిక రక్తపోటు గల కారణాలు అధిక రక్తపోటు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఒక నెలపాటు నిర్వహించాలని సూచించారు.  అధిక రక్తపోటు సాధారణంగా 30 పైబడిన వారికి అనారోగ్య అలవాట్లు కారణంగా రావచ్చు. లక్షణాలు తీవ్ర తలనొప్పి, దృష్టి లోపం, శ్వాస తీసుకోవడంలో సమస్య, చాతి నొప్పి, అలసట, మూత్రంలో రక్తం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మొదలైన లక్షణాలు కనిపించవచ్చు పై లక్షణాలు ఉన్నటువంటి వారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని సంప్రదించి మందులు ఉచితంగా పొందవచ్చును దీనివలన గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధి. మొదలగు దీర్ఘకాల వ్యాధులకు గురికాకుండా తగు జాగ్రత్త పడవచ్చును
అదేవిధంగా అధిక రక్తపోటు గురికాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్య అలవాట్లు పాటించవలెను అవి మంచి ఆహారము, ఆకుకూరలు, గుడ్లు, రోజు ఉదయం 30 నిమిషాలు నడక యోగ మెడిటేషన్ లాంటి దినచర్యలో భాగంగా చేసుకోవాలని అదేవిధంగా ఆహారంలో అధిక ఉప్పును నివారించి ధూమపానం మద్యపానం పూర్తిగా మానివేయవలెను జంక్ ఫుడ్, ఫ్రైడ్ చికెన్ మటన్ లాంటి పదార్థాలు తక్కువగా భుజించాలి పైన తెలిపిన అలవాట్ల ద్వారా హైపర్ టెన్షన్ రక్తపోటును నివారించవచ్చునని జిల్లా వైద్య మరి ఆరోగ్యశాఖ అధికారి తెలియజేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు