(జాగో న్యూస్): పట్టుదలే ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ”సాహసం చేయరా డింభకా రాజకుమారి లభించును”అనే చందంగా ఓ యువకుడు పట్టువదలని విక్రమార్కుడిగా పదవ ప్రయత్నం లో పదవ తరగతి పాసయ్యాడు. ఈ తంతు మహారాష్ట్రలోని బీడుకు చెందిన కృష్ణ నాందేవ్ ముండే అనే విద్యార్థి 2018 నుండి పదిసార్లు పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో గ్రామస్తులంతా బ్యాండ్ మేరాలతో ఆ విద్యార్థిని ఊరేగించి అభినందించారు.