కరీంనగర్, మే 31 (జాగో న్యూస్): ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని గ్రామ మండల కేంద్రాలలో ప్రభుత్వమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎమ్మార్వో ఎంపీడీవో ఎంఈఓ డిఓ డిపిఓ గ్రామపంచాయతీ ఆఫీస్ లలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ పట్టణంలో కోర్టు చౌరస్తా గోదావరిఖని పోయే బస్టాండ్ జగిత్యాల పోయే బస్టాండ్ రేకుర్తి కొత్తపెళ్లి గోదావరిఖనిపోయే నాకా చౌరస్తా కామన్ దగ్గర కోతిరాంపూర్ గంజి లో అలుగునూరు చౌరస్తా శివ టాకీస్ లేబర్ అడ్డా తదితర ప్రాంతాలలో జన సందోహం ఉన్నచోట మరుగుదొడ్లు నిర్మించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏవో గడ్డం సుధాకర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి అజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్ల వడ్ల రాజు సుందరగిరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
