కరీంనగర్, మే 31 (జాగో న్యూస్): ప్రపంచ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్. జి.సుజాత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కరీంనగర్ అవగాహన ర్యాలీ జెండా ఊపి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశంలో పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, పాన్ మసాలా, జర్దా, గుట్కా, తంబాకు, కర్ర మొదలగు వాటి వలన రోజుకు 3500 చనిపోతున్నారని పొగాకు ఉత్పత్తుల వలన అసంక్రమిక వ్యాధులైన క్యాన్సర్, రక్త పోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, కార్డియో మస్కులర్ వ్యాధులు, డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక రోగాలకు 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. మన రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల ఉత్పత్తి మరియు అమ్మకం నిషేధ చట్టం కోప్టా యాక్ట్ (copta act 2003) ప్రకారం బహిరంగ ప్రదేశాల లో పొగ తాగుట నేరమని 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధమని తెలిపారు మన కరీంనగర్ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వినియోగం వలనవచ్చే వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు 128 విద్యా సంస్థల యందు 148 గ్రామాల యందు నిర్వహించడంతో పాటు, రైల్వే స్టేషన్ బస్టాండ్, పాఠశాల నందు పొగాకు వ్యతిరేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవగాహన ర్యాలీలో డాక్టర్. కే.వి. రవీందర్ రెడ్డి జిల్లా టీ. బి అధికారి, డాక్టర్ సనా జవేరియా పి.ఓ.ఎం. సి హెచ్,డాక్టర్ శిల్ప ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ఆర్.ఎల్. కాంతారావు ఎస్.ఓ, ch. రంగారెడ్డి,డెమో. డిపిసి కోఆర్డినేటర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ సుజాత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కరీంనగర్ గారు తెలియజేశారు.
SD/-
డాక్టర్. సుజాత.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి. కరీంనగర్
