రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, మే 31 (జాగో న్యూస్): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో “ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు” అనే అంశం పైన జూన్ 10వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ సదస్సు యొక్క పోస్టర్ ను స్థానిక జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడుతూ పదవ తేదీన జరిగే రాష్ట్ర సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క మరియు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన  కార్యదర్శి బి వెంకట్ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ శివ దాసన్  హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టం అమలులో వస్తున్న సమస్యలు , ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధాాలను ఈ సదస్సు లో చర్చనున్నము. ఈసదస్సుకు మండల నుండి గ్రామాలనుండి అధిక సంఖ్యలో పాల్గొనాలి అన్నారు.బిజెపి ఈ 10సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకాన్ని నిధులు తగ్గించుకుంటూ వచ్చింది.దీనివల్ల గ్రామీణ పేదల తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే దీన్ని పకడ్బందీగా అమలుకు చేయాల్సిన కృషి చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు. కవ్వంపెల్లీ. అజయ్ , జిల్లా నాయకులు సుంకరి సంపత్ మండల నాయకులు భూమయ్య.. పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు