కరీంనగర్/గన్నేరువరం, మే 31 (జాగో న్యూస్): గన్నేరు వరం: శుక్రవారం రోజున మానస దేవి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయంలో సందడి నెలకొంది. 108 జంట శివ నాగ లింగాలు, మానసా దేవి ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీరాలని అమ్మవారికి భక్తులు ముడుపులు కట్టగా, కొంతమంది భక్తులు అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించారు. ముందస్తుగా ఆలయ కమిటీ చైర్మన్ ఎలేటి చంద్రారెడ్డి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు , కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
