కరీంనగర్/గన్నేరువరం, జూన్ 2 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం పోచమ్మ బోనాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయలుదేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతలు డప్పు చప్పుల మధ్య ఘనంగా ఊరేగింపు ఊరేగించారు. పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు ఆలయానికి చేరుకొని వర్షాలు బాగా కురవాలని పాడిపంటలతో ఇంటిల్లిపాలిది సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో చింతల శ్రీధర్ రెడ్డి, కాంతాల కొండల్ రెడ్డి నల్ల చంద్రారెడ్డి మధుకర్ రెడ్డి చింతల నరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి కిషన్ రెడ్డి మల్లారెడ్డి లక్ష్మారెడ్డి రాజిరెడ్డి వెంకటరెడ్డి అంజిరెడ్డి స్వామి రెడ్డి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.









