కరీంనగర్ ,జోన్ 3 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా ప్రైవేటు కారు డ్రైవర్స్ యూనియన్ సిఐటియు 8. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కారు డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్ఖానా గడ్డ ఓల్డ్ ఏజ్ వద్ద కేక్ కట్ చేసి,వృద్ధులకు, వికలాంగులకు, అందులకు, 100 మంది కి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ ప్రధాన కార్యదర్శి పున్నం రవి మాట్లాడుతూ….. ప్రైవేటు కారు డ్రైవర్లకు కనీస వేతనం 26,000 పిఎఫ్, ఇఎస్ఐ , సౌకర్యాలు కల్పించాలని , టెంపర్వరి డ్రైవర్లకు లోకల్ 800/ , హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు దూరాన్ని బట్టి వేయి నుండి 1200/ రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగాలు లేక పీజీలు డిగ్రీలు చేసిన వారు కారు డ్రైవర్లు ఉన్నారు. కారు యజమానులు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు ,ప్రభుత్వ అధికారులు ,ప్రైవేటు యజమానులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు గా పనిచేస్తున్న ప్రైవేటు కారు డ్రైవర్లు కు 12 వేల నుండి 15 వేల రూపాయల జీతాలు ఇస్తూ శ్రమను. దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, జీతాలు పెంచాలని కోరితే తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన స్థానంలో ఇతర కారు డ్రైవర్లు పనిచేయవద్దని కోరారు. ఒక్కరిద్దరూ చేసిన తప్పులకు కారు డ్రైవర్లను అందరినీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు అన్నారు. ఇంటి లోపల కారు డ్రైవర్లకు చెప్పకూడని పనులు చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని , ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు సంఘంలో చేరి సభ్యత్వము తీసుకొని సంఘము యొక్క నియమ నిబంధనలు పాటించాలని డ్రైవర్ల కు అండగా సిఐటియు ఉంటుందని తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కనీస వేతనాల జీవోను విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వమైనా కనీస వేతన జీవో 25న గెజిట్ చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రైవర్ వ్యవస్థలో కారు డ్రైవర్ కు చాలా విలువలు ఉంటాయి, కాబట్టి విలువలు పోగొట్టుకోవద్దని కోరారు, ప్రజా ప్రతినిధులు MPP మెదలు కొని CM, PM ప్రైమ్ మినిస్టర్ వరకు కారు డ్రైవర్సు పనిచేస్తేనే కార్యకలాపాలు జరుగుతాయని గుర్తు చేశారు, నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఆర్టీసీలో ఖాలీ గా ఉన్న డ్రైవర్, ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు 5 లక్షలు ప్రమాద భీమా 50 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. అనంతోజు రమేష్, నూనిగంటి రాజ, రోడ్ల రవీందర్, ఆవుల శ్రీనివాసు, కట్ట రమేష్, బొట్టు సుధాకర్, బాపు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
