డీడీ లు తీసిన గొల్ల కురుమలకు వడ్డీల భారం తప్ప ఏమి మిగలలేదు. * జి ఎం పి ఎస్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్

కరీంనగర్, జూన్ 3 (జాగో న్యూస్): గొల్ల కురుమలకు వడ్డీ ల భారం తప్ప ఏమి న్యాయం జరగలేదని గొర్రెలు మేకల పెంపకదార్ల సంఘం (GMPS) జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా పశువైద్య అధికారి బి నరెందర్ గారిని జిల్లా పశు సంవర్దక శాఖ కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కాల్వ సురేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీకి డీడీ లు తీసిన గొల్ల కురుమలకు ప్రభుత్వం నుండి గొర్రెల పంపిణీ పై ఖచ్చితమైన హామీ ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం (జిఎంపిఎస్) ఆద్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల సభ్యులు రెండో విడత గొర్రెల పంపిణీ కోసం జిల్లా లో 8753 మంది ఎదురు చూస్తున్నారు అని వారి లో 3414 మంది డీడీ ల రూపంలో ఒక్కో లబ్దిదారుడు 43750/- రూపాయలు జిల్లా కలెక్టర్ అకౌంట్ కు డీడీ ల రూపంలో చెల్లించి నెలలు గడుస్తుందని వారందరినీ డబ్బులు వాపస్ తీసుకోవాలని అధికారులు అంటున్నారు కానీ లబ్ధిదారులు ఎంతో శ్రమించి అప్పుల పాలై ప్రభుత్వం గొర్రెల పంపిణి చేబడితే ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని 25 శాతం వాటా దనం చెల్లించారని వారికి నిరాశే ఎదురైందని డీడీ లు రూపంలో వెనక్కి వచ్చిన నగదు బ్యాంక్ లో ఉన్న అప్పులకే పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీడీ లు వాపస్ తో వడ్డీ ల భారం మిగిలిందని గొల్ల కురుమలు ఆందోళనలో ఉన్నారు అని అన్నారు. ప్రభుత్వం నుండి వారికి ఖచ్చితమైన నిర్ణయం కానీ హామీ కానీ గొల్ల కురుమలకు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ లో అవకతవకలు జరిగాయని సాకు తో మొత్తం స్కీం ను పక్కదారి పట్టిస్తున్నారని అలా కాకుండా శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రెండో విడత గొర్రెల పంపిణీకి ఎదురు చూస్తూన్న గొల్ల కురుమల అందరికీ నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ లో అవినీతి అధికారులను అరెస్టు చేయడం శుభ పరిణామం అని మా సంఘం నుండి స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొనగాని మహేష్, భూస అయిలయ్య,సమ్బు రాజయ్య, కొమ్మ శ్రీకాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు