కరీంనగర్, జూన్ 10 (జాగో న్యూస్): బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో కరీంనగర్ బిజెపి కార్పొరేటర్లు సోమవారం ఢిల్లీలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కరీంనగర్ పట్టణ (1) ఇన్చార్జి , కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ , పెద్దపల్లి జితేందర్, కాసర్ల ఆనంద్, చొప్పర్ వేణు తదితరులు ఉన్నారు.
