కరీంనగర్, జూలై 20 (జాగో న్యూస్): కేంద్ర ప్రభుత్వం 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కి రావాల్సిన విభజన హామీలు అమలు జరిగేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్రం పై ఒత్తిడి తేవాలని, విభజన హామీ చట్టం ప్రకారం కరీంనగర్ లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని విభజన హామీ చట్టంలో ఉన్న పది సంవత్సరాలు అయిన ఇప్పటికీ కరీంనగర్ లో ఐఐఐటీ ఏర్పాటు కాలేదని, కరీంనగర్ జిల్లాకి రావాల్సిన ట్రిపుల్ ఐటీ గతంలో కర్ణాటక రాయచూరుకి మంజూరు చేశారని, ఈ బడ్జెట్ లో కరీంనగర్ లో ఐఐఐటీ మంజూరు చేయాలని, గతంలో కరీంనగర్ జిల్లాకు సైన్స్ సెంటర్, స్థలం కూడా మంజూరు అయిన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, శాతవాహన యూనివర్సిటీ కి న్యాక్ గుర్తింపు లేదని, శాతవాహన యూనివర్సిటీ కి 200కోట్ల నిధులు తీసుకురావాలని, పార్లమెంట్ పరిధిలో స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేయాలని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థి, నిరుద్యోగ యువతకు విద్య ,ఉపాధి అవకాశాలు స్థానికంగా దక్కేలా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, చిన్న, పెద్ద తరహా కంపెనీలు, పరిశ్రమలు కరీంనగర్ లో పార్లమెంటు పరిధిలో ఏర్పాటు అయ్యేలా బడ్జెట్ కేటాయింపుల్లో మంజూరు అయ్యేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని , తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, ఐఐఐటీ, ఐఐఎం లాంటి అనేక ఉన్నత విద్యాసంస్థల కేటాయింపులు చేయాలని విభజన హామీ చట్టం చెప్పిన ఇప్పటికీ అమలు కాలేదని విభజన హామీల అమలు జరిగేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని,కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యకు 10% నిధులు కేటాయించాలని,కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ విద్యార్థి,యువతకు న్యాయం చేయాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.
