స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకి అభినందనలు తెలిపిన పురుమల్ల శ్రీనివాస్

కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో 2024 ఆర్థిక సంవత్సరం పై ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్యని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా నాడు పార్లమెంటులో గల మెత్తిన సిరిసిల్ల రాజయ్యనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సేవకునిగా పనిచేస్తూ అధిష్టానం ఆశీస్సులతో నేడు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పట్ల వారికి అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపినారు. సిరిసిల్ల రాజయ్యని కలిసిన వారిలో శ్రీనివాస్ తో పాటు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కే సిరాజ్ హుస్సేన్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు