సామాజిక సంఘసంస్కర్త సేవాలాల్  * భీమా సాహెబ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిజన సంఘం

కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్: సామాజిక సంఘసంస్కర్త సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ అని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ అన్నారు. నేడు రాంనగర్ లో నిర్వహించిన సేవాలాల్ మహారాజు 286వ జయంతి ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు సంచార జీవనం కాకుండా, స్థిర నివాసం ఏర్పరచుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా కృషిచేసిన మహానీయుడని అన్నారు. మూఢనమ్మకాలను సామాజిక రుగ్మతలను రూపుమాపాలని కృషిచేసిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అని తెలిపారు వ్యవసాయం విద్యతో విజ్ఞాన సమాజంలో ముందుకెళ్లాలని మార్గదర్శనం చేసిన చైతన్య శీలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు లక్ పతి నాయక్, శ్రీనివాస్ నాయక్, శివ, దినేష్, శ్రావణ్,సింహాద్రి కృష్ణ మారుతి రామ్ చరణ్ అజయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు