కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారి కార్యాలయంలో సంత్ సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంత్ సేవలాల్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల తో పాటు కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బి ఆర్ ఎస్ నాయకులు రవి నాయక్, పలువురు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
