కరీంనగర్/శంకరపట్నం, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తాటిచెట్టు పైనుండి జారి పడటంతో ఓ గీత కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన కరీంపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే కరీంపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు గుర్రం వీరస్వామి శనివారం సాయంత్రం కళ్ళు గీసేందుకు వెళ్లి తాటిచెట్టు ఎక్కి కళ్ళు గీసే క్రమంలో కాళ్ళకు ఉన్న గుజి ఊడి పోవడంతో పట్టు కోల్పోయి చెట్టుపై నుండి పడి మధ్యలో వచ్చి ఆగడంతో అటుగా వచ్చిన గ్రామస్థులు గమనించి కిందకు దించారు. నోటి దంతాలు విరగడంతో పాటు తీవ్ర గాయా అయినాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్ కి తరలించారు.
