రాజన్న సిరిసిల్ల జిల్లా/తంగళ్ళపల్లి, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండలంలోని డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ గ్రామపంచాయతీ చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ గ్రామపంచాయతీ చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎన్నికల్లో 1340 పైచిలుకు ఓట్లు వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ ఎలక్షన్లో కూడా మా ఓట్లనే వినియోగించుకోవడం జరిగింది. 3000 పైచిలుకు జనాభా ఉన్నటువటీ కేసీఆర్ నగర్ ను గ్రామపంచాయతీ చేయడంలో ఈ అంతరాయం ఏంటని చెప్పేసి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మాకు ఓటు హక్కును కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క విన్నపం తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు అలాగే ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, మండల ఉపాధ్యక్షులు సిలివెరీ ప్రశాంత్, తంగళ్ళపల్లి మండలం OBC మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, కెసిఆర్ నగర్ కాలనీ భూత్ అధ్యక్షులు కటకం మధుసూదన్, అట్టిపాముల గణేష్ పాల్గొనడం జరిగింది.
