ప్రపంచ దేశాలతో నేడు భారతదేశం పోటీపడుతుంది… * స్వదేశీ పరిజ్ఞానం, ఆలోచనలతో ముందుకెళుతూ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుంది…. * దేశం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే స్వదేశీ వస్తువులను కొనాలి… * సామాజిక, సమరత వేదిక తెలంగాణ ప్రాంత సంయోజక్ అప్పాల ప్రసాద్ జి….

కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): భారతదేశం పై ఎన్నో దేశాలు దాడులు చేసి, మన సంస్కృతిని నాశనం చేసిన నిలదొక్కుకుని, నేడు ప్రపంచ దేశాల తో అన్నింట పోటీ పడుతుందని, స్వదేశీ పరిజ్ఞానం, ఆలోచనలతో ముందుకెళ్తూ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుందని సామాజిక , సమరసత వేదిక తెలంగాణ ప్రాంత సంయోజక్ అప్పాల ప్రసాద్ జి అన్నారు. స్వదేశీ మేళా ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజున అంబేద్కర్ స్టేడియంలో ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి అప్పాల ప్రసాద్ జి ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ముఖ్యంగా జపాన్ దేశంపై అనుబాంబు దాడి జరిగినప్పుడు దేశం పూర్తిగా నాశనం అయిపోయిందని అందరూ అనుకున్న , కొద్ది సంవత్సరాల లోనే ఆ దేశం అన్ని రంగాల్లో అమెరికాతో పోటీ పడే స్థితికి వచ్చిందన్నారు. 250 ఏళ్లు భారతదేశ సంస్కృతిని, సంపదను దోచుకున్నారన్నారని, అయినా అన్నింటినీ తట్టుకొని నిలబడిందని, ఇది భారత దేశగొప్పతనమన్నారు. ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలని , మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ,కాపాడుకోవాలని, భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. స్వదేశీ అంటే విదేశానికి వ్యతిరేకం కాదన్నారు. ముఖ్యంగా మన దేశంలో తయారైన వస్తువులను మనమే కొనాలని, మన డబ్బు మన దేశంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. 1947 స్వాతంత్ర అనంతరం వేద దేశంగా ఉన్న భారతదేశం అమెరికా ఇచ్చే గోధుమలు తినే పరిస్థితుల్లో ఉండేదని , నేడు 75 సంవత్సరాల తర్వాత ఆర్థిక అభివృద్ధి సాధించి 102 దేశాలకు అన్నం పెడుతుందన్నారు.1947 లో ప్రపంచంలో 168 ఆర్థిక ర్యాంకింగ్ తో ఉన్న దేశం నేడు 5 వ స్థానంతో దూసుకుపోతుందన్నారు. దేశం ఇంకా ఆర్థికంగా బలోపేతం కావాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో స్వాలంబన సాధించేందుకు స్వదేశీ జాగారణ్ మంచ్ స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. మన సంస్కృతి , వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో బౌల జాతి సంస్థల తుఫాన్ లో చిక్కుకొని చిన్నచిన్న పని వారు, కులవృత్తులు, వివిధ వృత్తులు , మన పటిష్ట ఆర్థిక కేంద్రాలకు మూల స్తంభాలైన వారసంతల వంటివెన్నో విలవిల్లాడుతూ కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో గత మూడు దశాబ్దాలుగా దేశంలోని ఆర్థిక రంగాలన్నింటిలోనూ, మన ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి, మన ఆర్థిక వ్యవస్థ పై విదేశీ శక్తుల ప్రభావాలకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ మంచ్ పోరాడుతుందన్నారు.. ఆ దిశలోనే స్వదేశీ భావజాల వ్యాప్తికి , సదస్సులు , సమావేశాలు, కార్యక్రమాలతో పాటు స్వదేశీ మేళాలు నిర్వహిస్తూ మళ్లీ మనదైన సాంస్కృతిక సామాజిక ఆర్థిక రంగాల పునర్ వైభవం కోసం కృషి చేస్తుందన్నారు. స్వదేశీ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రతి ఒక్కరు సందర్శించాలని, ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సభాధ్యక్షులు, స్వదేశీ మేళా కో కన్వీనర్ కళ్లెం వాసు దేవ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం పరం వైభవ స్థితికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ముఖ్యంగా దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, జీవితంలో రాణిచ్చే రంగాన్ని ఎన్నుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అవసరానికి మించి సోషల్ మీడియాను వినియోగించవద్దని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ ముక్కహరీష్ బాబు, ముత్యాల జగన్ రెడ్డి, వసంత్ వ్యాలీ స్కూల్ కరస్పాండెంట్ ఇనుకొండ బుచ్చిరెడ్డి, సప్తగిరి హై స్కూల్ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు