జడ్చర్ల, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు లో 35 కేజీ భర్తీ నింపుటకు హమాలీ సంఘాలు సంచులు చిన్నగా వున్నాయి చినిగిపోయిన సంచులు ఖరీదారులు ఇచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హమాలి సంఘాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియను ఆపేసిన లక్ష్మి కృష్ణ ట్రేడర్స్ అనే ఖారీదారి శ్రీనివాస కమిషన్ ఎజెంట్ శ్రీనివాసులు టెండర్ ఎందుకు ఆపేశారు అని ప్రశ్నించగా అట్టి కమిషన్ ఎజెంట్ నిలదీయడంతో ఖరీదారి భజరంగ్ తో కమిషన్ ఎజెంట్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు చాలా వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కమిషన్ ఏజెంట్ సంఘం అధ్యక్షుడిని వివరణ కోరగా గతంలో 40 కేజీలు బరువు కుడా వేరుశనగ భర్తీ చేయడం జరిగిందని కానీ ఇప్పుడు 30 కేజీలు భర్తీ చేస్తే చాలా ఇబ్బందిగా మారిందని ఈ నేపథ్యంలో ధరలు తక్కువగా వేస్తామని ఖరీదారులు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కమిషన్ ఎజెంట్ సంఘం అధ్యక్షుడు పరుశవేది తెలిపారు. 30 కేజీ ల భర్తీ చేస్తామని టెండర్ ప్రక్రియ ఎలా ఆపుతారు చుస్తామని హెచ్చరించండంతో మళ్ళీ టెండర్లనుప్రారంభించారు,అనంతరం మార్కెట్ సెక్రటరీ కల్పించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గొడవ కొద్దిగా సద్దుమణిగింది.
