కరీంనగర్, మార్చ్ 04 (జాగో న్యూస్): మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో ఈనెల రెండవ తేదీన శ్రీపదరావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ఎస్.ఆర్. ప్రైమ్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో వారు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారు సాధించిన పథకాలను విద్యార్థులకు అందజేసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కరాటే లోని పలు విభాగాల్లో ఈ పథకాలను వారు సాధించారు. సన్నిధి గోల్డ్ మెడల్,అన్యదక్ష రెడ్డి గోల్డ్ మెడల్,ఆర్యాహి సిల్వర్ మెడల్, ధనిక్షా సిల్వర్ మెడల్, మనస్విని సిల్వర్ మెడల్,ఉషశ్రీ బ్రాంజ్ మెడల్, రిషికేష్ బ్రాంజ్ మెడల్ లు సాధించారు. ఈ కార్యక్రమంలో కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ సురభి వేణుగోపాల్, ఎస్సార్ ప్రైమ్ జోనల్ ఇంచార్జ్ శశిధర్, పాఠశాల ప్రిన్సిపల్ రాజి రెడ్డి, పాఠశాల ఇంచార్జ్ వరుణ్ రావు,పిఈటి వంశీ, తదితరులు ఉన్నారు.
