విలాసాగర్ హైస్కూల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల, మార్చి 04 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ను మంగళవారం పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన మండలంలోని నర్సింగాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల ఒకటో తరగతి నుండి 5వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఆ పాఠశాల హెచ్ఎం గుర్రం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విలాసాగర్ హై స్కూల్ కు ఉదయం ప్రార్థన సమయం కు చేరుకొని ప్రార్థనలో పాల్గొని పాఠశాలలోని లైబ్రరీ ,సైన్స్ ల్యాబ్, త్రాగునీరు, డిజిటల్ తరగతులు, బాలసభ ,క్రీడల తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులు పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థుల అనుమానాలను నివృత్తి ఉపాధ్యాయుల ద్వారా చేసుకున్నారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి నెలుట్ల శ్రవణ్ కుమార్, విలా సాగర్ ప్రధానో ఉపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగా అభివృద్ధి కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతూ వాటిని పాఠశాలల్లో అమలు అయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నయని, అందులో భాగంగా పిఎం శ్రీ ప్రవేశపెట్టిందని ఈ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాల రెండో విడతలో ఎంపికైందని,ఈపథకం ద్వారా విద్యార్థులకు అన్ని రంగాలపై అవగాహన కలగడమే కాకుండా, పాఠశాల అభివృద్ధి నోచుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని సౌకర్య కలిగి ఉండి, పురాతన హై స్కూల్ విలాసాగర్ ఎంచుకొని విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు విద్యారంగం పట్ల మంచి అవగాహన కలుగుతుందని,ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ శ్రవణ్ కుమార్, హెచ్ఎం బొలగం శ్రీనివాసులు కోరారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు ఎం రాజిరెడ్డి, శోభారాణి, జోష్నారాణి, సురేందర్ రెడ్డి, పిడి ప్రభాకర్ తో పాటు నర్సింగాపూర్ పి ఎం శ్రీ పాఠశాల ఉపాధ్యాయులు వోడ్నాల జగన్, సి ఆర్ పి తిరుపతి, తాత్కాలిక ఉపాధ్యాయులు దొంతర వేణి కళ్యాణి, జనగాం పద్మ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు