ఎల్లమ్మతల్లి బోనాల జాతరకు ఎమ్మెల్యే కవంపల్లి 

బెజ్జంకి, మార్చి 04 (జాగో న్యూస్): బెజ్జంకి మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మతల్లి బోనాల జాతరలో మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్ని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాడ్లాడుతూ ఎల్లమ్మతల్లి ఆశీస్సులు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ఈ బోనాల జాతరలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగెస్ అధ్యక్షుడు ఒగ్గె దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, పార్టీ నాయకులు చెలువేరు శ్రీనివాస్ రెడ్డి, జెల్ల ప్రభాకర్, పులి సంతోష్, లింగాల శ్రీనివాస్, మధు, భైర సంతోష్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, బి.రమేశ్, శరత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు