రాజన్న సిరిసిల్ల, మార్చి 09 (జాగో న్యూస్): ఆనాడు నీకు సర్పంచ్ పదవి కోసం నీ దగ్గర చిల్లిగవ్వ లేకున్నా మేమంతా ఓ దళిత బిడ్డ చదువుకొని గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చాడని ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ చే 40 వేల రూపాయలు ఇచ్చి సర్పంచిగా గెలిపించి రాజకీయ బిక్ష పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ కాదా అని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ మాట్ల మధును ప్రశ్నించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోనితో పాటు పలువురు మండల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ 15 సంవత్సరాల నా క్రియాశీలక రాజకీయ జీవితంలో ఎవ్వరినీ.. నేనేం అనలేదని, మీ నీచపు మాటలు, అడ్డగొలు అబద్ధాలు చూస్తుంటే మాట్లాడక తప్పడం లేదని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కూడా ఇక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రజల పక్షాన పొరాడమని చెప్పిన నాయకుడు కేకే మహేందర్ రెడ్డి అని కొనియాడారు. మాదిగ జాతి బిడ్డ సర్పంచ్ అయ్యిండని ప్రజల మన్ననలు పొందుతుండని మేం కూడా ఎంతగానో గర్వపడ్డామని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని కుల ప్రతిపాదికన నన్ను మాట్లాడడం నీకు సరికాదన్నారు. పది సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసి జిల్లెల్లా ప్రజలను మోసం చేసినవ వ్యక్తివి నువ్వేనని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మేం పోరాటం చేసినం, ధర్నాలు చేసినం పదుల సంఖ్యలో కేసులు చేసుకున్నాం,కానీ నువ్వేం చేసినవ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు దళిత,గిరిజనుల మీద అనేక దాడులు జరిగిన ఏ ఒక్క దానికైనా స్పందించావా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు సోయిలేక ప్రశ్నించని నువ్వు దళిత కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడానికి సిగ్గులేదా అని నేను కూడా దళితున్నే అనే విషయం మరిచిపోయావా అని పరీక్షించారు. కేటీఆర్ కు దగ్గరని చెప్పుకుంటవు కదా… నీ నాయకుడు ఇలాగే మాట్లాడమని చెప్పిండా, కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లైతే గొప్పొడు అయిపోత అని అనుకోవడం, విద్యార్థి నాయకుడిగా 2001 నుండి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పక్షాన నిలబడి వ్యక్తిని, నీ లాగా గెలిచి దొరల మోచేతి నీళ్లు తాగాలే..వాళ్ళ గేట్ల దగ్గర కాపాల కాయలేదురా సన్నాసి, నా మొహం గురించి మాట్లాడుతవార.. ఊర్లల్లో ప్లెక్సీలు కడుతాం బాగాలెంది.. నీ మొహమా నా మొహమో చూద్దాం. చింపాంజీ మొహమోడ నువ్వా నా మొహం గురించి మాట్లాడేది. బచ్చపల్లి తిరుపతి మీద పోటీ చేసినప్పుడు మా దగ్గరికి వస్తె మేం అండగా నిలిచి మా మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇస్తే గెలిచినా సంగతి మార్చినవా అని ప్రశ్నించారు. ఇంకోసారి కేకే మహేందర్ రెడ్డి గురించి, నా గురించి నాలుకా జారితే అంబేద్కర్ దగ్గర బట్టలిప్పి…గాడిద మీద ఊరేగిస్తం బిడ్డ అని హెచ్చరించారు. అగ్రి కల్చర్ కాలేజీలో భూమీ కోల్పోయిన మీ స్వంత గ్రామస్థులకు పట్టాలు ఇప్పియ్యలేని దద్దమ్మవు నువ్వు, నీ ఊర్లో పీడిఏస్ రైస్ దందాకు డబ్బులు తీసుకొని అండగా ఉన్నది నువ్వు కాదా అన్నారు. నాలుక అదుపులో పెట్టుకో… లేదంటే చిరెస్తం, తన్నీ తరిమేస్తం, బిడ్డ కబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ,లింగాల భూపతి, నెరల్లా నరసింగం గౌడ్,మునిగేలా రాజు, కట్కం రాజు, భైరినేని రాము,పొన్నాల పరుశురాం, ఆరేపల్లి బాలు,ఎత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇటుకల మహేందర్,చుక్క రాజశేఖర్, గుగ్గిళ్ళ భరత్,ప్రశాంత్, లక్ష్మిరాజం,గణేష్,లక్ష్మణ్,రాజేశ్వర్ రావు, ముక్క వాసు,బండి పరుశురాం,సీహెచ్ ప్రశాంత్, సుద్దాల శ్రీనివాస్, ఎండి ఇక్బాల్, మాధవరెడ్డి, బాలసాని శ్రీను,చిలుక శ్రీను, గణాది కిషన్,తదితరులు పాల్గొన్నారు.
