జంతర్ మంతర్ లో బిసి పోరుగర్జనలో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం నేతలు

కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): పెంచిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కరీంనగర్ నుండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి తరలి వెళ్లి బిసి పోరుగర్జన సభలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారాజు రాకేష్ చారి, వాయిల రాజ్ కుమార్ , మోత్కూరు శ్రీనివాస్, బోయిని ప్రశాంత్ బియ్యని తిరుపతి మహేష్ పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన 42 శాతం రిజర్వేషన్ ని జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో వెంటనే ఆమోదం తెలపి జాతి జనగణలో కులగన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు తోపాటు ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇండ్ల ముందు నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు. ఒకవేళ ఆమోదించినట్లయితే జనం మీకు నీరాజనాలతో పాటు మంగళహారలతో స్వాగతం పలుకుతారని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు