కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్టులో వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 53 పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ పాల్గొని తగిన సూచనలు సలహాలు ఆరోగ్యం గురించి పిల్లలకు తెలియజేసినారు. మరియు మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, మరియు ఎన్ సతీష్ ప్రిన్సిపల్, డాక్టర్ మౌనిక (ఆప్తమి లేజిస్ట్), డాక్టర్ అరవింద్ (పీడియాట్రిక్) డాక్టర్ భరద్వాజ్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ మహేష్ (ఆర్థోపెడిక్) మరియు సూపర్వైజర్ శ్రీనివాస్ వెంకటేశ్వరి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
