కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ పరిధిలోని బొమ్మ వెంకన్న చౌరస్తా, నాకా చౌరస్తాలలో కీ.శే. గొట్టిముక్కుల అనసూయ సత్యనారాయణ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రాలను సోమవారం రోజున కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు మాజీ కార్పొరేటర్లు గొట్టిముక్కల ఉమారాణి వెంకటరమణ , వంగల పవన్, దురిశెట్టి అనూప్, బిజెపి కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్, తణుకు సాయి డివిజన్ ప్రముఖులు, బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
