కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జెండా ఊపి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించి వైద్య పరీక్షలు జరిపారు. తద నంతరము జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఒక్కొక్క థీమ్ తోని 1948 సంవత్సరం నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరము ఆరోగ్యకర ఆరంభాలు – ఆశాజనక భవితవ్యాలు అనే థీమ్ తోని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. తల్లి బిడ్డల ఆరోగ్యం పై ప్రభుత్వము మరియు ప్రజలు అందరూ వారి బాధ్యతగా స్వీకరించడం సుస్థిర, సంపన్న, భవిష్యత్తు నిర్మాణానికి మానవజాతి మనుగడకు చాలా అత్యవసరం. స్త్రీ సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి పొందడం ప్రతి స్త్రీ యొక్క ప్రాథమిక మానవ హక్కు, ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది. తల్లి బిడ్డల ఆరోగ్యం బిడ్డ పుట్టిన తర్వాత మరియు జీవితంలో చాలాకాలం వరకు ప్రభావితం చూపుతుంది. కనుక అత్యున్నత ఆరోగ్య వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంచినట్లెన ఇప్పుడున్న భారతదేశం యొక్క మాతృ మరణాల రేటు 97, తెలంగాణలో 43 గాను, శిశు మరణాల రేటు భారతదేశంలో 35, తెలంగాణలో 21గాను ఉన్నదని వీటిని ఇంకా గణనయంగా తగ్గించవచ్చు అన్నారు. ఈ ప్రపంచానికి ఆరోగ్య దినోత్సవ సమావేశంలో అడిషనల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధా, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ సాజిదా, డాక్టర్ శైలేంద్ర కుమార్, డాక్టర్ సన జవేరియా, డెమో రాజగోపాల్, డిపిహెచ్ఎన్ఓ విమల, స్వామి, డాక్టర్ ప్రణీత, డాక్టర్ సాయికుమార్ మరియు కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
