కరీంనగర్, జూన్ 04 (జాగో న్యూస్): గత 29 డిసెంబర్ 2023 వ సంవత్సరంలో ఇచ్చిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రము అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఇచ్చి 17 నెలలు గడుస్తున్న ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వకపోగా దానికి సంబంధించిన మేము పెట్టిన ఒరిజినల్ పేపర్స్ ఇవ్వమని అడిగితే మాకు తెలియదు, ఎవరికైనా చెప్పుకో అని ఇష్టం వచ్చినట్లుగా సమాధానం చెబుతున్నారు. అంతేకాక చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తే ఆఫీసులో పొడగట్టడమే కాకుండా మరల రీప్రింట్ తీసుకువచ్చిన కూడా నెలలు గడిచిన ఇష్యూ చేయడం లేదు. మరలా వెళ్లి అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుతున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదు. వీటిపై జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కలెక్టర్ మేడం గారు స్పందించడం లేదు. ఆఫీసులో కొంతమంది చేతివాటం సాగిస్తున్న కూడా చూసి చూడనట్టుగా వదిలి వేస్తున్నారు..మరి వీరిపై ఎవరు చర్య తీసుకోవాలి.. సామాన్యుల పరిస్థితి ఏమిటి. చెప్పులు అరిగేలా తిరిగినా కూడా కనికరం లేని అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు.. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయి అనుకుంటే ఇంకా అధ్వానంగా అవుతున్నాయి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఏ రాజకీయ నాయకులైన ఆర్బాటలకే మొదలవుతున్నారు తప్ప నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇవి చేస్తాం అవి చేస్తామని ప్రగల్ బాలే పలకడమే తప్ప ఏమి చేసింది లేదని , వీరికి తోడు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వత్తాసు పలుకుతూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు.. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఎమ్మార్వో ఆఫీస్ లు, తనిఖీ చేసి సరైన ప్రభుత్వ అధికారులను నియమించాలని RTI రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
