*వరల్డ్ నెంబర్ 1 లీడర్ ప్రధాని మోదీ….
*వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా , చారిత్రక , సాహసోపేత నిర్ణయాలతో 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలన….
*11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం… సంకల్ప సాకారం పేరిట చేపట్టాల్సిన కార్యక్రమాలను విజయవంతం చేయాలి…
కరీంనగర్/తిమ్మాపూర్, జూన్ 06 (జాగో న్యూస్): 11 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో దేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, గ్లోబల్, వరల్డ్ మోస్ట్ పాపులర్ నంబర్ వన్ లీడర్ స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా , చారిత్రక సాహసోపేత నిర్ణయాలతో 2014 నుండి మోడీ ప్రభుత్వ పాలన విజయవంతంగా కొనసాగుతుందని బిజెపి నాయకులు, తిమ్మాపూర్ మండలం ఇన్చార్జి గుజ్జ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ఆదేశానుసారం , రాష్ట్ర పార్టీ సూచన మేరకు, 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం – సంకల్ప సాకారం పేరిట తిమ్మాపూర్ మండలంలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల కోసం శుక్రవారం రోజున మహాత్మా నగర్ లోని శ్రీ తపాలా లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుజ్జ సతీష్, అధ్యక్షత వహించిన బొంతల కళ్యాణ్ చంద్ర లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన , నాయకత్వంలో భారతదేశ దిశా దశ మారిందన్నారు. ఆత్మనిర్బార్ భారత్ , మేకిన్ ఇండియాతో దేశం తిరుగులేని శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన, చారిత్రక నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పతంలోకి తీసుకువెళ్లాయన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఉగ్రవాదుల స్థావరాలను మట్టు పెట్టి ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించి దాయాదిదేశంపై సాధించిన చారిత్రక విజయంతో దేశ కీర్తి , ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోతుందన్నారు. అందుకే 11 ఏళ్ల మోదీ విజయవంత పాలన ప్రస్థానంపై జాతీయ పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ… సంకల్ప సాకారం పేరిట పలు కార్యక్రమాలను , ప్రోగ్రాంలను చేపట్టాలని జాతీయ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ప్రోగ్రాంలన్నీ బిజెపి శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో ప్రధానంగా జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులపాటు తమ తమ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ముఖ్యంగా అమ్మ పేరిట ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు . అలాగే 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి ముఖ్య కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ సూచన పత్రంలో అన్ని కార్యక్రమాలను విజయవంతం చేపట్టాలని సందర్భంగా పిలుపునిచ్చారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయవంత పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తూ , ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత త్రివిదదళాలకు, ప్రధాని మోదీ కి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. సమావేశానంతరం అనంతరం శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కళ్యాణమండప ప్రాంగణం వద్ద బిజెపి శ్రేణులు పలు మొక్కలు నాటారు.