కరీంనగర్/తిమ్మాపూర్, జూన్ 06 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం “ESTRELLA-2k25” పేరిట ఫ్రెషర్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ జి.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈసీఈ విద్యార్థులందరూ ప్రస్తుత ఎలక్ట్రానిక్స్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరియు విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ సిహెచ్.ప్రకాష్ రెడ్డి, వి.వినోద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్.శ్రీనివాస్, ఈసీఈ విభాగధిపతి డాక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
