*బడి బాట కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు పోరెడ్డి దామోదర్ రెడ్డి పిలుపు..
కరీంనగర్/మానకొండూర్, జూన్ 08 (జాగో న్యూస్): ప్రో.జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జి ప ఉ పాఠశాల పచ్చునుర్ ఉపాధ్యాయ బృందం ఇంటి ఇంటికి తిరిగి బడి బాట కరపత్రాలు తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు పంపిణి చేస్తూ..ఈ సందర్బంగా సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు పోరెడ్డి దామోదర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు ఎ.షీలా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, వాటి బలోపేతానికి ప్రో, జయశంకర్ బడి బాట కార్యక్రమం ద్వారా జూన్ 6 నుండి జూన్ 12వరకు రోజువారీ గా షెడ్యూల్ రూపొందించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ను పెద్ద సంఖ్యలో పెంచాలి అని ఆదేశాలు ఇచ్చింది అని వీరు తెలిపారు,
పిల్లలు పెరిగేతే ప్రభుత్వ పాఠశాలలు రక్షించంచ బడుతాయి అని దీనికి గ్రామం లో ని మేధావులు, పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముందుకు వచ్చి కృషి చేయాలి అని వారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు, ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత షూస్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు ఎగ్స్, రాగి జావా లాంటి సౌకర్యాలు కలిపిస్తుంది అని ఈ దిశగా తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆలోచన చేయాలి అని వీరు వారికీ తెలిపారు. దీనిద్వారా అంతరాలు లేని బడులను అభివృద్ధి చేసుకొని ఉన్నోడు. లేనోడు అయినా ఒకే బడిలో ఒకే తరగతి లోవిద్యార్థులు చదువుకోనే పరిస్థితి ని కల్పించాలి అని వీరు అభిప్రాయపడ్డారు. ఈ బడి బాట కార్యక్రమంలో పచ్చునుర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎ.షీలా, ఏ సురేందర్, ఏ రామచంద్రం, ప్రాథమిక పాఠశాల ప్ర. ఉ వేంకటేశ్వరు, సరిత, సి ఆర్ పి శ్రీనివాస్, శ్రీధర్, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాలుగోన్నారు.