*అర్హత సాధించిన విద్యార్థులకు తగిన చేయూతనిస్తాం.. సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ …
కరీంనగర్, జూన్ 08 (జాగో న్యూస్): పదవ తరగతిలో 470 సాధించిన విద్యార్థులు, నిరుపేద తల్లిదండ్రులు లేని విద్యార్థులపై చదువుల నిమిత్తం సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్, కపిల్ విద్య వారధి ద్వారా ఆర్థిక చేయూత నివ్వాలనే సంకల్పంతో అర్హత కలిగిన విద్యార్థుల కోసం ఆదివారం రోజున కరీంనగర్లో నిర్వహించిన అర్హత పరీక్ష కు 226 మంది విద్యార్థిని , విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యంగా అర్హత పరీక్ష లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన వారు ఏ కోర్సు చేసిన, జీవితంలో వారికి నచ్చిన ఏ వృత్తిలోనైనా స్థిరపడే వరకు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని సంక్షేమ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.