కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): గర్భిణీ స్త్రీలు పేద రోగులు వివిధ రోగాలతో ప్రైవేట్ హాస్పటలకు ఆశ్రయిస్తే సకాలంలో వైద్యులు వైద్యం అందించకపోవడం వల్ల రోగులు చనిపోతున్నా వైద్య అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆరోపించారు. బుధవారం రోజున శ్రీలత నర్సింగ్ హోమ్ లో మరణించిన శిరీష అనే గర్భిణి మహిళ మృతి పై విచారణ జరిపించాలని ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని కోరుతూ బుధవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా DM&HO డాక్టర్ సుజాత కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన వర్షిని పురిటి నొప్పులు రావడంతో ప్రసూతి కోసం నగరంలోని శ్రీలత మెటర్నటి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం క్రితం అడ్మిట్ అయిందని కాగా డెలివరీ చేసిన ఆరు రోజులకే ఆపరేషన్ వికటించి మహిళా మృతి చెందిందని వారు ఆరోపించారు. సోమవారం వరకు ఆరోగ్యంగానే ఉన్న వర్షిని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిన్న మరణించడం దిగ్భాంతికలిగించిన విషయమని డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి నిదర్శనమన్నారు. సంబంధిత డాక్టర్లను ఆమె మృతి గల కారణాలను అడిగితే వివరణ ఇవ్వకుండా దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ హోమ్, మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సంతాన సౌపల్య కేంద్రాలు లాంటి రకరకాల పేర్లు పెట్టి అర్హులైన వైద్యులు లేకుండా వారి యొక్క పట్టికలో అర్హులైన వైద్యులు ఉన్నారని చూపిస్తూ రోగులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్కింగ్ స్థలాలు ఫైర్ సేఫ్టీ, హాస్పటల్ అనుమతులు అర్హులైన వైద్యులు లేకున్నా హాస్పటల్ నడుపుతున్నారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన నేటి వరకు ఆస్పత్రిలు తనిఖీ నిర్వహించక పోవడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి బంధువులు లతా నర్సింగ్ హోమ్ ముందు ఆందోళనలు నిర్వహిస్తే గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన మహిళ బంధువులకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తున్న పరిస్థితి జిల్లా కేంద్రం నేలకొల్పిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు రావద్దంటే ముందస్తుగా వైద్యాధికారులు ఒక తనిఖీ బృందమ్ ఏర్పాటుచేసి నిజనిర్ధరణ కమిటీ పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆసుపత్రులను సీజ్ చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ఆయన అన్నారు. కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా అర్హులు లేని వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో నెలకొల్పి వైద్యాన్ని వ్యాపారంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా శ్రీ లత నర్సింగ్ హోమ్ ఆదర్శ హాస్పిటల్ లో చనిపోయిన బాలింత మహిళ ఎలా చనిపోయిందో న్యాయవిచరణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. జిల్లా వైద్యాధికారులు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో కుమ్ముకై చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వెంటనే శ్రీలత నర్సింగ్ హోమ్ సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి,శ్రీనివాస్,నరేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.









