కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ తరఫున బిజెపి నాయకుడు బండ రమణారెడ్డి శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. కలెక్టర్ ఛాంబర్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన అందించారు. రమణారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ, బిజెపి నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, డి శంకర్ పాల్గొన్నారు. పోలీస్ అధికారులు మూడంచెల భద్రత వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. టౌన్ ఏసిపి నరేందర్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.
