గన్నేరువరం మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలి…

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): మండల కేంద్రం గన్నేరువరానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని టిడిపి మండల అధ్యక్షుడు గుండా పరుశురాం డిమాండ్ చేశారు. శుక్రవారం గుండ్లపల్లి స్టేజి వద్ద మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రం ఏర్పాటు కాకముందు రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుండి గన్నేరువరం కు సరిపడా బస్సులు నడిచేవి నేడు మండల కేంద్రం ఏర్పడినప్పటికీ ఒక్క బస్సు కూడా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపెళ్లి, గోపాలపూర్, హనుమాజు పల్లి, మాదాపూర్ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి నానా పాట్లు పడుతున్నారని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు, సిఏలు మండల కేంద్రంలో జరిగే ప్రత్యేక సమావేశాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ అధికారులు సొంత వాహనాలలో మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం ఈ రూట్లో బస్సు లేకపోవడంతో మహిళలకు అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ఆర్టీసీ అధికారులు తక్షణం స్పందించి బస్సులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు