కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 20 (జాగో న్యూస్: కరీంనగర్ జిల్లా లోని తిమ్మాపూర్ మండలం,కొత్తపల్లి గ్రామం లోని గోలి రాంరెడ్డి అనే వ్యవసాయదారుడి వరి పొలం లో 2023-24 యాసంగి సీజన్ కు గాను వరి పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగినది. ఇట్టి ప్రయోగం అర్థ గణాంఖ శాఖ హైదరాబాద్ డిప్యూటి డైరెక్టర్ మోహన్ రెడ్డి మరియు ఉప గణాంఖ అదికారుల పర్యవేక్షన లో నిర్వహించడం జరిగినది. 5 మీటర్ ల పొడవు, 5 మీటర్ ల వెడల్పుతో పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఇందులో 18.795 కిలోల దిగుబడి వచ్చింది అని శ్రీ డి.కొమురయ్య ముఖ్య ప్రణాళిఖ అధికారి తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీనివాస్ మరియు ప్లానింగ్, వ్యవసాయ శాఖలకు సంభందించిన అధికారులు పాల్గొనడం జరిగింది.
