కరీంనగర్, ఏప్రిల్ 20 (జాగో న్యూస్): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్ రోడ్డు లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి గడప గడపకు పంచ న్యాయాలు కార్యక్రమం ద్వారా పాద యాత్ర చేసుకుంటూ పంచ న్యాయాల గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు పరచనున్న పంచ న్యాయాల పట్ల ప్రజలలో మంచి స్పందన వస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు. పది సంవత్సరాల బిజేపి పాలన పై ప్రజలు విసుగు చెందారని బండి సంజయ్ కుమార్ గత అయిదేళ్లలో ఏమీ చేయని అసమర్థ ఎంపిగా మిగిలి పోయాడని ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతారని ప్రజలు అంటున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మునిగి పోయిన నావ అని బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందన్న విషయం ప్రజలలో ఉందని నరేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కూడా ప్రజా పాలన రావలసిన అవసరం ఉందని చెప్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తూ మార్కెట్ రోడ్డు,ప్రధాన కూరగాయల మార్కెట్,గంజి రోడ్డు,అన్నపూర్ణ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ భాద్యుడు దన్న సింగ్,అబ్దుల్ రహేమాన్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,ఎండి చాంద్,కుర్ర పోచయ్య, బత్తిని చంద్రయ్య,దండి రవీందర్, లాయక్,షబానా మహమ్మద్, పెద్దిగారి తిరుపతి, అస్తపురం రమేష్, బషీర్, భారీ, ఊరడి లత, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, మహాలక్ష్మి, తిరుమల, పద్మ, సలిమొద్దున్, ఆమెర్, షేహెన్షా,మోసర్ల రాంరెడ్డి, శ్రీరాముల రమేష్,సతీష్ రావు,దీకొండ శేఖర్,కిరణ్ రెడ్డి, ఇమ్రాన్,ఆశ్రఫ్, ఖలీల్,ఆంజనేయులు,మాసుం ఖాన్,మామిడి సత్యనారాయణ రెడ్డి, కటకం కృష్ణ, జిలకర రమేష్, మంద మహేష్ తదితరులు ఉన్నారు.
